Komatireddy Venkat Reddy: నల్గొండలో మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో.. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్,కౌన్సిలర్లు భేటీ అయ్యారు.
Balasani Laxminarayana: బీసీ లకు జరిగిన అవమానం కోసం రాజీనామా చేశానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. నా ఆత్మభిమానం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
Renuka Chowdhury: విద్యార్థుల ప్రాణాలకి విలువ లేదా? కేటీఆర్ ఐటీ కింగ్ అంటారు.. పేపర్ల లీకేజీకి ఆయనే బాధ్యత వహించాలని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister KTR: మంత్రి కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాలను స్వయంగా కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లనున్నారు. దీంతో ఈ విషయం చర్చకు దారితీస్తోంది.
చంద్రబాబు భద్రతపై లోకేష్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని తెలిపారు. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమని తెలిపారు.
పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ చిట్ చాట్లో తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
Minister KTR: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీరక లేకుండా రాష్ట్రం మెుత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేవారు.
Bandi Sanjay: ఆదిలాబాద్ వేదికగా అమిత్ షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు.
జనగామ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం తెలుస్తోంది. మినిస్టర్ క్లబ్ హౌస్ లో కాసేపట్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.