అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. శీలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తనపై జరిగిన దాడి ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తనను దారుణంగా కొట్టారని చెప్పాడు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశారని.. రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలతో కలిసి తలుపులు మూసి దాడి చేశారని తెలిపాడు. వదిలేయమని మంత్రి తండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలాడినా వినిపించుకోలేదని…