మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన కిచెన్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 24న తనిఖీలో భాగంగా కిచెన్లో పలు కాలం చెల్లిన వస్తువులతో పాటు అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఫిర్యాదులు రావడంతో కిచెన్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు.