15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) కు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపిందని.. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. సర్వే పూర్తవగానే DPR ల పనులు ప్రారంభిస్తారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటుజహీరాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ చాలా మందితో మాట్లాడారు.. వారందరూ పార్టీలో చేరనున్నారు అని ఆయన పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమని కోరితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పెట్రోల్ ధర అత్యధికంగా తెలంగాణలోనే ఉంది అని ఆయన ఆరోపించారు.
వినియోగదారులకు ఉపశమనంగా, రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు కానుకగా 14.2 కిలోల ఎల్పిజి వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ₹ 200 తగ్గించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.. breaking news, latest news, telugu news, big news, kishan reddy, brs
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. దీంతో రోజు రోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పార్టీల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు గానూ 115 స్థానాల్లో బరిలో దిగే అభ్యర్థుల లిస్ట్ను ప్రకటించింది. breaking news, latest news, telugu news, big news, kishan reddy, bjp,
ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో 'రైతు గోస-బీజేపీ భరోసా' బహిరంగ నిర్వహిస్తుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సునీల్ బన్సల్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రైతులకు మేలు జరగడం లేదు.. కనీసం ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న పార్టీ బీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ.. తెలంగాణను దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. ఇలాంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో మనం ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.