Kishan Reddy : కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా ఔషాపూర్, ఘట్కేసర్లో జరిగిన బీజేపీ యువమోర్చ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యువమోర్చతో నాకు గొప్ప అవినాభావ సంబంధం ఉందన్నారు. జిల్లాస్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని, యువమోర్చలో పనిచేసిన అనేకమంది నాయుకులు మంత్రులు కేంద్రమంత్రులు ముఖ్య మంత్రులు అయ్యారన్నారు.
రాజనాథ్ సింగ్, నుంచి మొదలుకొని శివరాజ్ సింగ్ చౌహన్ నాతో పాటు అనేకమందిని నాయకులుగా తీర్చిడిద్దింది యువమోర్చనే అని గర్వాంగా చెప్పగలనన్నారు కిషన్ రెడ్డి. రేపటి భవిషత్తు మీదే యువమోర్చదే అని చెప్పగలనని, తెలంగాణలో యువమోర్చ నాయకులు ప్రభుత్వ వైపాల్యాపై పోరాటం చేస్తుంది భవిష్యత్ లో మరింత కష్టపడాలి బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు పోరాటం చేయాలన్నారు కిషన్ రెడ్డి.
Also Read
- IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
- IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
అంతేకాకుండా.. ‘ప్రభుత్వ తప్పిదాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్ని చైతన్య పరచాలి ఆ బాధ్యత యువమోర్చ తీసుకోవాలి. 1200 మంది ఆత్మబలిదానాలతో, అనేక మంది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. భూములమ్మితే గాని ప్రభుత్వం నడిచే పరిస్థితిలేదు. వైన్ షాపుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయి.అప్పులుచేసి కోచింగులు తీసుకొని కష్టపడుతుంటే.. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యకుండా వేధిస్తోంది.
ప్రతి నిరుద్యోగికి రూ. 3016 చొప్పున ఇస్తానని మాట తప్పారు. ఏడాది పొడవునా బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఏకమొత్తంలో రుణమాఫీ చేయలేదు.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేశారు. గత తొమ్మిదేండ్లలో బీసీలను, రైతులను, విద్యార్థులకు అన్యాయం జరిగింది. కేవలం బాగుపడింది కేసీఆర్ కుటుంబ సభ్యులు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కోసం.. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పి.. బిజెపి ని గెలిపించేందుకు సిద్ధమయ్యారు.’ అని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Peddi : 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
-
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!