నాడు పాదయాత్రలో మీ కష్టాలు చూశాను.. నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పాను. నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆస్పత్రి, త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి మీ బిడ్డ మీ ముందు నిలబడ్డాడు అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.
సీఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. గురువారం రోజు పలాస పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ను ప్రారంభించనున్న సీఎం.. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు