వయనాడ్లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో…
కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పప్పనంకోడ్లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఇద్దరు మహిళలు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
JP Nadda: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సంచలన విషయాలను హేమా కమిటీ వెలుగులోకి తీసుకువచ్చింది. పలువురు స్టార్ యాక్టర్స్ మహిళా టెక్నీషియన్స్, నటీమణులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనికి తోడు పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న కొన్ని వేధింపుల గురించి చెప్పడం సంచలనంగా మారింది.
Malayalam cinema: మలయాళ సినీ పరిశ్రమలో మహిళా వేధింపులపై ఇటీవల హేమా కమిటి సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొందరు అగ్ర నటులుపై వచ్చిన ఆరోపణలు ప్రకంపలను రేపుతున్నాయి. మలయాళ పరిశ్రమలో మహిళా నటులపై కమిట్మెంట్ల పేరుతో వేధింపులు జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని పినరయి విజయన్ సర్కార్ ఆదివారం నిర్ణయించింది.
కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేసారు. మలయాళ చిత్రసీమలో మహిళలు లైంగిక వేధింపుల నుండి వేతన వ్యత్యాసాల వరకు ఎదుర్కొంటున్న 17 సమస్యల పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు బహిర్గతం కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో రాజకీయ దుమారానికి దారితీసింది. చిత్ర పరిశ్రమలోని మహిళల నుంచి వెల్లువల ఫిర్యాదులు రావడంతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుండి వైదొలిగారు సినీ…
ఇటీవలే కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన వయనాడ్లో పంది మాంసం తినే ఛాలెంజ్పై తీవ్ర రచ్చ నెలకొంది. సహాయక చర్యల కోసం డబ్బు సేకరించేందుకు ప్రారంభించిన ఈ ప్రచారంపై ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) పోర్క్ ఛాలెంజ్పై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. ఇది ఏ మత సమాజాన్ని కించపరిచేలా చేయలేదని పేర్కొంది.
Bank Manager Fraud: కొత్తగా బ్యాంకుకు వచ్చిన మేనేజర్ ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ బ్రాంచ్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. కొత్త మేనేజర్ ఇర్షాద్ తాకట్టు పెట్టిన బంగారాన్ని చూసే సరికి ఏదో తప్పు జరిగినట్లు అక్కడ గుర్తించారు. తాకట్టు పెట్టిన బంగారంలో నకిలీ బంగారం బయటపడింది. తదుపరి విచారణలో పెద్ద కుంభకోణం జరిగిందని తేలడంతో ఇర్షాద్ పోలీసులను ఆశ్రయించాడు. తమిళనాడు…
పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో గతేడాది వచ్చిన సినిమా ఆడు జీవితం. కేరళలో నజీజ్ అనే వ్యక్తి బ్రతుకు తెరువుకు గల్ఫ్ కంట్రి అయిన దుబాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు నజీబ్ నజీబ్ తిరిగి కేరళ వచ్చాడా, దుబాయ్ లో ఎటువంటి దారుణ పరిస్థితులను ఎదురక్కోన్నాడు వంటి కథాంశంతో తెరకెక్కిన ఆడు జీవితం భాషతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 2023 కేరళ టాప్ గ్రాసర్ చిత్రాల సరసన నిలిచింది.…
కేరళలోని కోజికోడ్లో ఓ ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి కంఫౌండ్ గోడలను పూర్తి రైలులా కనిపించే విధంగా ప్రత్యేకమైన డిజైన్గా మార్చాడు.
Pappachan murder: కేరళలో పాపచ్చన్ అనే 82 ఏళ్ల వృద్ధుడి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్ని తలపిస్తోంది. దురాశ, నమ్మక ద్రోహంతో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న మహిళా ఈ క్రూరమైన ప్లాన్కి స్కెచ్ వేసింది. ముందుగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన గ్యాంగ్, సీసీకెమెరాలను పరిశీలించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.