తలపతి విజయ్ సెట్ లో ఉన్న మరో స్టార్ హీరోను గుర్తు పట్టలేకపోయాడట. ప్రస్తుతం విజయ్ “బీస్ట్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తీ “సర్దార్” అనే…
ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెండవ చిత్రం “ఖైదీ”. 2019లో విడుదలైంన ఈ చిత్రంలో కార్తీ, నరేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తలపతి విజయ్ “బిగిల్”తో పోటీ పడిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి. అంతేకాకుండా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించింది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కనుందని, ఇతర భాషల్లో కూడా రీమేక్ కానుందనే వార్తలు వస్తున్నాయి. Read Also : కొత్త మూవీకి తేజ సజ్జ…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటీమణులలో నిన్నటితరం హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, విజయ్, అజిత్, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె కంటెంట్ ఉన్న చిత్రాల్లో వైవిధ్యభరితంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. తాజాగా ఈ నటీమణి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తదుపరి చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. Read Also…
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చర్చనీయాంశము అయ్యింది. తాజాగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ ను కూడా…
కరోనాను పారద్రోలే ప్రయత్నంలో సెలెబ్రిటీలంతా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ను వేయించుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ కోవిడ్ -19 వ్యాక్సిన్లో మొదటి మోతాదును తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పిక్ పోస్ట్ చేశారు కార్తీ. ఈ పిక్ లో కార్తీ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం మనం చూడవచ్చు. ఇక కరోనా పోరులో భాగంగా కార్తీ తన అన్న, తండ్రితో కలిసి తమిళనాడు ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. అంతేకాకుండా…
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు…
తమిళ స్టార్ హీరో కార్తీ ఈరోజు 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తీ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దంటూ అభిమానులను అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజున అభిమానులు తమ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే తనకు వారిచ్చే మంచి బహుమతి అని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మాస్కులు, శానిటైజర్లు వాడడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్, భద్రతా చర్యలకు…
ఎలాంటి విపత్తు వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటానికి ముందుకు వస్తుంటారు సూర్య బ్రదర్స్. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభాగ్యులను చదవిస్తూ… పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా తొలి దశలోనూ ఎంతో మంది బాధితులకు సహాయం అందించిన సూర్య బ్రదర్స్ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన స్టాలిన్ ను కలిసి అభినందించి కోవిడ్ బాధితులును ఆదుకోవాలంటూ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఎన్నికల్లో గెలిచిన స్టాలిన్ ను విశాల్ వంటి పలువురు చిత్రప్రముఖులు కలసి ప్రచారానికి వాడుకుంటుంటే……
ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో డి.ఎం.కె పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎం.కె. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగా… ఆయన తనయుడు, నటుడు ఎమ్మెల్లేగా ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పలువురు నటులు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను కలిసి అభిమానిస్తున్నారు. తాజాగా సూర్య తండ్రి శివకుమార్, సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించారు. అంతేకాదు కోవిడ్-19పై చేస్తున్న పోరాటానికి…
దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం లాక్ డౌన్ ను విధించాయి. ఇక పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ‘మాస్క్ పొడు’ అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో…