Musalamma: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంక గ్రామంలో భక్తులు విశేష భక్తి శ్రద్ధలతో శ్రీముసలమ్మ అమ్మవారిని అలంకరించారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా జరిగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని 30 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణలో కొత్త కరెన్సీ నోట్ల మధ్య అమ్మవారు సిరులను కురిపించే ధనలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. Breastfeeding-benefits : డెలివరీ తర్వాత చనుబాలు ఇస్తే బరువు తగ్గుతారా? వైద్యులు ఏం అంటున్నారంటే..…
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది. మంగళవారం జరిగే ఉగాది వేడుకలకు ఈ రోజు నుంచి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నడంతో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అందుకనే వీటి ధరలు మరింతగా పెరిగాయి. తెల్ల చామంతి కేజీ రూ. 450 దాటి పలకగా మిగిలిన చామంతులు రూ.350 నుంచి 400 పలికాయి.