ఎపి నుంచి వచ్చే ఆంబులెన్సును తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్పోస్టులో ఆపడం తీవ్ర ఆందోళన ఆవేదనకు దారితీసింది. కరోనాచికిత్స అవసరాలను బట్టి చూసినా హైదరాబాద్కు మరో మూడేళ్లు ఎపి తెంగాణ ఉమ్మడి రాజధాని ప్రతిపత్తి రీత్యా చూసినా ఇది చాలా అనూహ్యమైన పరిణామం. ఈ ఘటను కలకలం రేపుతున్నా ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన లేకపోయింది. తెలంగాణ హైకోర్టు తనకు తానుగా దీనిపై ఆగ్రహం వెలిబుచ్చి ఆపవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా తెలంగాణ వైఖరి మారకపోవడం,…