Home
Join
Join News
-
AUS vs IND: అశ్విన్ స్థానంలో యువ క్రికెటర్ ఎంపిక.. స్క్వాడ్లో చేరనున్న అన్క్యాప్డ్ స్పిన్నర్
టీమిండియా మాజీ లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన అశ్విన్.. మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా.. ఆయన స్థానంలో మిగతా టెస్టు మ్యాచ్ల కోసం యువ క్రికెటర్ను ఎంపిక చేశారు. మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ముందు బౌలింగ్ ఆల్ రౌండర్ తనుష్ కోటియన్ జట్టులో చేరనున్నాడు. -
IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..
న్యూజిలాండ్తో ముంబైలో జరగనున్న మూడో టెస్టు కోసం ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మంగళవారం (అక్టోబర్ 29) జట్టులోకి వచ్చాడు. సిరీస్ ప్రారంభంలో అతను టీమిండియాలో రిజర్వ్ ప్లేయర్గా ఉన్నాడు. ఆ తర్వాత అస్సాంతో ఢిల్లీ రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్లో ఆడేందుకు వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్కు హర్షిత్ ఎంపికయ్యాడు. -
Congress: బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు
హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది. హర్యానాలోని రోహ్తక్లో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భరత్ భూషణ్ బన్నా సమక్షంలో రమిత్ ఖట్టర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. -
Kolkata Rape Case: కోల్కతాలో కొనసాగుతున్న నిరసనలు.. పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్లో ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలు నిరసనల్లో పాల్గొన్నారు. సినీ దర్శకురాలు అపర్ణా సేన్తో సహా బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం వేలాది మంది ప్రజలతో కలిసి నిరసనల్లో పాలు పంచుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి చేపడుతుంది. -
Vaddiraju RaviChandra: బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ ఎంపీ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు… -
K. Keshava Rao: కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని
కే.కేశవరావును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని' అని అన్నారు. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
Breaking News: రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా..
రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. -
Vikarabad: చేవెళ్ల ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. కాంగ్రెస్లో చేరడంపై కార్యకర్తల అసంతృప్తి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం తగిలింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో.. గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. -
Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీ అభ్యర్థి సమక్షంలో వైసీపీలో చేరికలు..
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే… -
Yarlagadda Venkatrao: గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరిక..
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు.. ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా.. తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానంటున్న యార్లగడ్డను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Virat Kohli Record: అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ.. నంబర్-1 ప్లేయర్గా చరిత్ర!
-
Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుర్చీల కొట్లాట.. త్వరలోనే హైకమాండ్ కీలక నిర్ణయం!
-
EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
-
Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
-
Bhagyashree: “వయసు కాదు.. పాత్ర గొప్పది”.. రితేష్కు తల్లిగా నటించడంపై భాగ్యశ్రీ క్లారిటీ
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!