Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీ అభ్యర్థి సమక్షంలో వైసీపీలో చేరికలు..
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే నాయకులకు సవాల్ చేస్తున్నా.. డీఎన్ఆర్ అనే వ్యక్తిని దాటుకొని రావాలన్నారు. అక్కడ ప్రజలను 40 ఏళ్ల నుంచి పీల్చి పిప్పి చేశారని.. ఆటపాక గ్రామానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
Birthday Celebrations: గగనతలంలో తల్లికి పుట్టినరోజు వేడుకలు చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్..
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
కానీ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశామని దూలం నాగేశ్వరరావు తెలిపారు. తాము చేసిన అభివృద్ధి గురించి ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అంతేకాకుండా.. ఈ గ్రామానికి సంబంధించిన భూములు, ఆస్తులను దోచుకున్న వారిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరిమికొట్టారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతీ ఒక్కరూ ధైర్యంగా ఇళ్లు కట్టుకుంటున్నారని.. ఎలాంటి దాడులు, అన్యాయాలు లేవన్నారు.
AP High Court: వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
తమ సమక్షంలో 500 మందికి ఇళ్ల స్థలం, ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. కానీ.. గత 40 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓట్లు రాగానే ప్రజలను వాడుకోవడం.. తర్వాత గాలికి వదిలేయడమని టీడీపీపై దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. కానీ.. తాను నిరుపేదలకు, ఇళ్లు లేని వారికి సహాయం చేసినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆటపాక గ్రామానికి రూ.2 కోట్ల 80 లక్షలతో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ఈ సందర్భంగా.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ సీఎంగా జగనన్నను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని దూలం నాగేశ్వరరావు కోరారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!