Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీ అభ్యర్థి సమక్షంలో వైసీపీలో చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే నాయకులకు సవాల్ చేస్తున్నా.. డీఎన్ఆర్ అనే వ్యక్తిని దాటుకొని రావాలన్నారు. అక్కడ ప్రజలను 40 ఏళ్ల నుంచి పీల్చి పిప్పి చేశారని.. ఆటపాక గ్రామానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
Birthday Celebrations: గగనతలంలో తల్లికి పుట్టినరోజు వేడుకలు చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్..
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
కానీ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశామని దూలం నాగేశ్వరరావు తెలిపారు. తాము చేసిన అభివృద్ధి గురించి ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అంతేకాకుండా.. ఈ గ్రామానికి సంబంధించిన భూములు, ఆస్తులను దోచుకున్న వారిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరిమికొట్టారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతీ ఒక్కరూ ధైర్యంగా ఇళ్లు కట్టుకుంటున్నారని.. ఎలాంటి దాడులు, అన్యాయాలు లేవన్నారు.
AP High Court: వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
తమ సమక్షంలో 500 మందికి ఇళ్ల స్థలం, ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. కానీ.. గత 40 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓట్లు రాగానే ప్రజలను వాడుకోవడం.. తర్వాత గాలికి వదిలేయడమని టీడీపీపై దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. కానీ.. తాను నిరుపేదలకు, ఇళ్లు లేని వారికి సహాయం చేసినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆటపాక గ్రామానికి రూ.2 కోట్ల 80 లక్షలతో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ఈ సందర్భంగా.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ సీఎంగా జగనన్నను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని దూలం నాగేశ్వరరావు కోరారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!