Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీ అభ్యర్థి సమక్షంలో వైసీపీలో చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే నాయకులకు సవాల్ చేస్తున్నా.. డీఎన్ఆర్ అనే వ్యక్తిని దాటుకొని రావాలన్నారు. అక్కడ ప్రజలను 40 ఏళ్ల నుంచి పీల్చి పిప్పి చేశారని.. ఆటపాక గ్రామానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
Birthday Celebrations: గగనతలంలో తల్లికి పుట్టినరోజు వేడుకలు చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్..
Also Read
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
కానీ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశామని దూలం నాగేశ్వరరావు తెలిపారు. తాము చేసిన అభివృద్ధి గురించి ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అంతేకాకుండా.. ఈ గ్రామానికి సంబంధించిన భూములు, ఆస్తులను దోచుకున్న వారిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరిమికొట్టారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతీ ఒక్కరూ ధైర్యంగా ఇళ్లు కట్టుకుంటున్నారని.. ఎలాంటి దాడులు, అన్యాయాలు లేవన్నారు.
AP High Court: వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
తమ సమక్షంలో 500 మందికి ఇళ్ల స్థలం, ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. కానీ.. గత 40 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓట్లు రాగానే ప్రజలను వాడుకోవడం.. తర్వాత గాలికి వదిలేయడమని టీడీపీపై దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. కానీ.. తాను నిరుపేదలకు, ఇళ్లు లేని వారికి సహాయం చేసినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆటపాక గ్రామానికి రూ.2 కోట్ల 80 లక్షలతో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ఈ సందర్భంగా.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ సీఎంగా జగనన్నను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని దూలం నాగేశ్వరరావు కోరారు.
తాజావార్తలు
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!