జనగామ పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జనగామ మున్సిపాలిటీ, చంపక్ హిల్స్లో మానవ విసర్జీతాల శుధ్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ మున్సిపాలిటీ లోపల మల శుద్దీకరణ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషమన్నారు. 2 కోట్ల 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి కేంద్రం ఇది ఆయన వెల్లడించారు. కేసీఆర్ దయవల్ల జనగామను జిల్లా చేసుకున్నామన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం విశాలంగా ఉందని సీఎం…