Pakistan: పఠాన్ కోట్ దాడి మాస్టర్ మైండ్, జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల పాకిస్తాన్ లోని సియాల్కోట్ లో కాల్చి చంపారు. అయితే ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్ సన్నిహితుడిగా పేరున్న షాహీద్ లతీఫ్ ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో కాల్చి చంపారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుల్గామ్ లో భద్రతా బలగాలు శుక్రవారం జైషే మహ్మద్ మాడ్యూల్ ను చేధించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్, రెండు మోర్టల్ షెల్స్, భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటీవల కాలంలో దాదాపుగా రోజు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. గతంలో సోపోర్ ఎన్…