పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా సిరియాపై విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసగా గగనతల దాడులకు తెగబడింది. శుక్రవారం నుంచి పలుమార్లు దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది.
సిరియా తూర్పు ప్రాంతంలో సిరియా సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు జరిపిన దాడిలో 23 మంది సిరియన్ సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.