US-Iran Talks: మధ్యప్రాచ్యంలో సంఘర్షణకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని చర్చల బృందం పాకిస్తాన్ చేరుకున్నాయి. ఇక ఇరాన్ చర్చల బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఉన్నారు.