Rajat Patidar: ఆర్సీబీ మ్యాచ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ దుమ్మురేపాడు. బౌలర్లుకు చుక్కలు చూయించాడు. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యువ ఆటగాడి విధ్వంసకర ఇన్నింగ్స్కు అభిమానులు, మాజీ, తాజా ప్లేయర్స్ నుంచి భారీ ప్రశంసలు లభించాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.