బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద రేపు జరపతలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య గొంతు నులిమేసే కుట్ర అని, సీఎం ధర్నా చేస్తే ఒప్పు….బీజేపీ దీక్ష చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం… ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడండి అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ‘ప్రజాస్వామ్య…