శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 జనవరి 6న భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) గమ్యస్థానానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.