టీ20 వరల్డ్కప్ 2026 సూపర్-8 దశలో సెమీఫైనల్ రేసు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా గ్రూప్-1 రేసు రసవత్తరంగా ఉంది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన వెస్టిండీస్.. సూపర్-8లోనూ ఘనంగా బోణీ కొట్టింది. సోమవారం ముంబైలో జరిగిన మ్యాచ్లో 107 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో విండీస్ సెమీస్ రేసులో ముందంజలో ఉంది. నెట్ రన్రేట్ వెస్టిండీస్కు భారీ ప్లస్ కానుంది. భారత్పై గెలిచిన దక్షిణాఫ్రికా కూడా మరో గెలుపుతో…