Home
India Defence News
India Defence News News
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఏ రోగానికి ఏ మందు కావాలో అది మన దగ్గర ఉందని.. అలాగే బ్రహ్మోస్ కూడా ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. మన దగ్గర వ్యాక్సిన్ ఉంది.. బ్రహ్మోస్ కూడా ఉందని పేర్కొన్నారు. -
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
India Rank: ప్రపంచ దేశాలు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచినట్లు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక వెల్లడించింది. ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్ ఒకటిగా నిలిచింది. రక్షణ రంగ వ్యయంలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.9 శాతం పెరుగుదల అని సిప్రి నివేదిక చెప్పింది. చైనానే టార్గెట్: ఇదే… -
Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
భారత్ రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలో రాకెట్ లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించడం ద్వారా భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. రక్షణ పరిశోధన సంస్థల సహకారంతో రూపొందించిన ఈ ఆధునిక రాకెట్ వ్యవస్థ శత్రు స్థావరాలపై వేగంగా, ఖచ్చితంగా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు వెల్లడించారు. తాజా పరీక్షలో రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని… -
S-400 missile system: ఎస్-400తో సహా భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు కేంద్రం ఓకే..
S-400 missile system: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు ఓకే చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో రూ. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో… -
Pralay Missiles: “ప్రళయ్” మిస్సైల్ టెస్ట్ విజయవంతం.. దీని ప్రత్యేకతలు ఇవే..
Pralay Missiles భారత్ బుధవారం రెండు ప్రళయ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఒకే లాంచర్ నుండి స్వల్ప వ్యవధిలో రెండు ప్రళయ్ క్షిపణులను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఒడిశా తీరంలో ఈ టెస్ట్ జరిగింది. ప్రళయ్ స్వదేశీగా అభివృద్ధి చేసిన క్వాజి-బాలిస్టిక్(పాక్షిక-బాలిస్టిక్) మిస్సైల్. దీనికి అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యం ఉంది. దీంట్లో అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ ఉంది. దీంతోనే ఖచ్చితమైన దాడులు చేయగలదు. వివిధ లక్ష్యాలపై బహుళ రకాల వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి… -
Defence Deal: భారతదేశానికి అమెరికా ఆయుధాలు.. $93 మిలియన్ల డీల్కు ఆమోదం..
Defence Deal: భారతదేశానికి 93 మిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆమోదించింది. ఇరు దేశాల మధ్య భారీ డిఫెన్స్ డీల్ ఓకే అయింది. ఈ డీల్లో భాగంగా అమెరికా భారత్కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎక్స్కాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ రౌండ్ల కొత్త బ్యాచ్ను అందించేందుకు మార్గం సుగమమైంది. -
Indian Military: చైనా, పాక్లకు బ్యాడ్ న్యూస్.. రూ.79,000 కోట్ల రక్షణ కొనుగోళ్లకు పచ్చజెండా..
Indian Military: భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి రూ. 79,000 కోట్లతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’’ ఆమోదం తెలిపింది. -
PM Modi Diwali 2025: వీర జవాన్లతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్ – పాక్కు పవర్ఫుల్ మెసేజ్!
PM Modi Diwali 2025: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతుండగా, గోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నావికాదళ సిబ్బందితో 2025 దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని గోవా నావికా స్థావరంలో నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీతో దీపావళి జరుపుకోవడం ఒక గౌరవం” అని అన్నారు. “ఒక వైపు నాకు సముద్రం ఉంది, మరోవైపు వీర సైనికుల అపారమైన బలం ఉంది. సముద్ర జలాలపై సూర్యకిరణాల ప్రకాశం, వీర సైనికులు వెలిగించిన… -
BrahMos 800km Missile: పాకిస్థాన్కు భారత్ అదిరిపోయే దీపావళి షాక్ .. కొత్త బ్రహ్మోస్ రానుంది!
BrahMos 800km Missile: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే సమయంలో భారత్.. పాకిస్థాన్కు అదిరిపోయే దీపావళి షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత సైన్యం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటుంది. తాజాగా సైన్యం కొత్త ప్రకటన విడుదల చేసింది.. రాబోయే రెండేళ్లలో సైన్యంలోకి 800 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చేరనుంది. ఈ క్షిపణి 2027 చివరి నాటికి పూర్తిగా పనిచేయనుందని రక్షణ… -
Indian Air Force Strength: చైనాను వెనక్కి నెట్టిన భారత్.. యూఎస్, రష్యా తర్వాత ఇండియానే..
Indian Air Force Strength: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనాను భారత్ వెనక్కి నెట్టింది. ఎందులో అనుకుంటున్నారు.. వైమానిక దళంలో భారతదేశం చైనాను అధిగమించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ (WDMMA) తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, రష్యా తర్వాత ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళాన్ని కలిగి ఉంది భారతదేశం. READ ALSO: India Warns Pakistan: ఆఫ్ఘన్కు…
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!