S-400 missile system: ఎస్-400తో సహా భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు కేంద్రం ఓకే..
- భారీ రక్షణ కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం..
- ఎస్-400 సహా కీలక ఆయుధ వ్యవస్థలకు ఓకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S-400 missile system: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు ఓకే చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో రూ. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కొనుగోలు ఉండబోతోంది. భారీ కొనుగోలుకు సంబంధించిన విషయాన్ని రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
భారత సైన్యం కోసం ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్, ఆర్మర్డ్ ఫియర్సింగ్ ట్యాంక్ మందుగుండు సామాగ్రి కొనుగోలు ద్వారా ట్యాంక్లపై దాడి సామర్థ్యం పెరుగుతుంది. హై కెపాసిటీ రేడియో రిలే, ధనుష్ గన్ సిస్టమ్, రన్ వే ఇండిపెండెంట్ సర్వైలెన్స్ సిస్టమ్స్కు ఆమోదం లభించింది. భారత కోస్ట్ గార్డు కోసం హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికిల్స్ కొనుగోలుకు డీఏసీ ఓకే చెప్పింది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్ను కొడుతున్న ఇరాన్…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలోపేతం కోసం పాతబడిన AN-32, IL-76 విమానాల స్థానంలో మిడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలుకు ఆమోదం లభించింది. అలాగే శత్రదేశాల మిస్సైల్స్, విమానాలు, డ్రోన్లను అడ్డుకోవడం కోసం రష్యా నుంచి S-400 మిసైల్ వ్యవస్థ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది సమర్థవంతంగా పనిచేసింది. రిమోట్గా నియంత్రించే స్టైక్ డ్రోన్లను కొనుగోలు చేయనున్నారు. సుఖోయ్-30 విమానాల ఇంజన్ భాగాల అప్గ్రేడ్ కోసం అనుమతి లభించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే భారీ స్థాయిలో రక్షణ కొనుగోళ్లకు ఆమోదం లభించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మొత్తం రూ. 6.73 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. రూ. 2.28 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.
తాజావార్తలు
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!