ఒకప్పుడు రన్ మెషీన్గా ఓ వెలుగు వెలిగిన విరాట్ కోహ్లీ.. కొంతకాలం నుంచి ఆ స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. అవకాశాల మీద అవకాశాలు ఇస్తోన్నా.. వాటిని సద్వినియోగపరచుకోవడం లేదు. మూడేళ్ల నుంచి సెంచరీ కూడా చేయలేదు. రీసెంట్గా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లోనూ ఫెయిలయ్యాడు. దీంతో కోహ్లీపై వేటు తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో కోహ్లి రాణించకపోతే.. అదే అతని ఆఖరి సిరీస్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ…
ఎట్టకేలకు అత్యంత కీలకమైన మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు తన సత్తా చాటింది. ఏ పెర్ఫార్మెన్స్ అయితే ముందు నుంచి కోరుకుంటున్నామో.. అలాంటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై తాండవం చేసి, భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అవును, విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో గెలుపు జెండా ఎగరేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20…
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత తుది జట్టుని ప్రకటించడం వరకూ.. జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియాలో స్థానంపై కొంత వివాదమైతే నెలకొంది. అతడు అద్భుతంగా బౌలింగ్ వేస్తోన్నా, వేగంగా బంతులు విసురుతూ బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెడుతున్నా.. ఎందుకు భారత జట్టులో చోటివ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. మాజీలు సహా, పాకిస్థాన్ వాళ్లూ పెదవి విరిచారు. అనుభవం పేరుతో కావాలనే అతడ్ని జట్టులో తీసుకోవడం లేదని మండిపడ్డారు. చివరికి ఆ విమర్శలకి చెక్ పెడుతూ.. అతనికి…
కొంతకాలం నుంచి ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. పోనీ ఐపీఎల్లో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడనుకుంటే.. ఆ టోర్నీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు అర్థసెంచరీలు మినహాయిస్తే, అతడు ఎలాంటి మెరుపులు మెరిపించలేదు. ముఖ్యంగా.. అత్యంత కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్లో కోహ్లీ ఏమాత్రం సత్తా చాటకుండా త్వరగా ఔటవ్వడంతో తీవ్రంగా నిరాశ చెందారు. దీంతో, అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్ళు సైతం కోహ్లీని విమర్శించారు. నెటిజన్లైతే…