Home
India China Relations
India China Relations News
-
BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
BRICS: బ్రిక్స్ సదస్సు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరుకాలేదు. జిన్పింగ్తో పాటు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ సహా మరికొందరు నేతలు కూడా ఈ విందుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం బ్రిక్స్ సమావేశాల కోసం న్యూఢిల్లీ చేరుకున్న జిన్పింగ్, ఆ తర్వాత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత బ్రిక్స్ దేశాధినేతలకు, ప్రముఖులకు… -
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
Modi-Xi Jinping Bonding at BRICS Summit: ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) సమ్మిట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య కనిపించిన అరుదైన సాన్నిహిత్యం. సుమారు ఏడేళ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన జిన్పింగ్, సమ్మిట్ వేదికగా మోడీతో పంచుకున్న క్షణాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సమ్మిట్ ప్రారంభోపన్యాసం చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ హఠాత్తుగా ప్రసంగాన్ని ఆపి, జిన్పింగ్ వైపు తిరిగారు. ఆయన… -
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
India-China Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల సమావేశం అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన అధికారిక ప్రకటనలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల వేర్వేరు విధానాలను స్పష్టం చేస్తున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఏడేళ్లకు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాటి ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా… -
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
PM Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భారతదేశానికి వచ్చారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అత్యంత కీలకమని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒప్పందాలను, అవగాహనను ఇరు పక్షాలు పాటించాలని సూచించారు. ద్వైపాక్షిక సంబంధాలు , పెట్టుబడులు, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం తర్వాత… -
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
PM Modi-Xi Jinping: 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీతో, జిన్పింగ్ శనివారం భేటీ అయ్యారు. భారత్, చైనాలు తమ పరస్పర బలాల నుంచి నేర్చుకుని, ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి సాధించగలవని అన్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీతో చైనా అధ్యక్షుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు సమస్య, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై రెండు… -
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
BRICS 2026: న్యూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశాల్లో ఒక ఫోటో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కలిసి ఉన్న ఫోటో ప్రత్యేకంగా మారింది. మోడీ మధ్యలో నిలబడగా, ఇరు వైపుల పుతిన్, జిన్పింగ్ మోడీ చేతులు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు నేతలు సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుతున్న ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ ఫోటో… -
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
Modi-Jinping: బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ న్యూఢిల్లీ వచ్చారు. శనివారం సాయంత్రం భారత మండపంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. భారత్-చైనా ద్వైపాక్షిక చర్చలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. వాణిజ్య లోటు, రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువు సరఫరా, వాణిజ్య ఒప్పందాల వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మోడీ-జిన్పింగ్ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది. అరుదైన ఖనిజాలపై చర్చ: ప్రపంచ టెక్నాలజీకి ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్,… -
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
Xi Jinping: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్య్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఉదయం 11:40 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మంటపంలో జరిగే రెండు రోజుల సదస్సులో భాగం కానున్నారు. జిన్పింగ్ కాన్వాయ్లో సీపీసీ సెంట్రల్… -
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
China-India Air Connectivity: భారత్-చైనా మధ్య విమాన రాకపోకలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ నేరుగా విమాన సర్వీసు మళ్లీ ప్రారంభం కానుంది. చైనాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ చైనా సదరన్ ఎయిర్లైన్స్ భారత్కు తన రెగ్యులర్ ప్యాసింజర్ సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 21, 2026 నుంచి గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ మార్గంలో విమాన సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది.… -
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
Kiren Rijiju: చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి భారత్ ఖచ్చితమైన వైఖరిని స్పష్టం చేశారు. పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలనే భారత్ ఆశిస్తోందని, అంతమాత్రాన దేశ సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన 'బ్రిక్స్ డైలాగ్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్-చైనా ఉద్రిక్తతలు, సరిహద్దు పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ…
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!