IND vs ENG: మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు తమ వన్డే ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. టీ20ల కోసం ఇంగ్లాండ్ తమ జట్టులో అనేక మార్పులు…
భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 150 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లీష్ జట్టును మట్టికరింపించింది. ఐదు టీ20 మ్యాచ్ ల సరీస్ లో 4-1 అధిక్యంతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అసలు సిసలైన హీరో ఎవరంటే అభిషేక్ శర్మ అని చెప్పాలి. తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఇంగ్లండ్ జట్టు ఆటకట్టించాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సూర్యకుమార్ సేన ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 4-1 ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఐదో టీ20లో అదగొట్టింది. ఈ మ్యాచ్ లో…
వాంఖడే స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన టీమిండియా కుర్రాళ్లు భారీ స్కోర్ అందించారు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్…
ఐదు టీ20 సిరీస్లో భాగంగా కాసేపట్లో చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగే ఐదో టీ20 మ్యాచ్కు సంజు శాంసన్ ను పక్కన పెట్టనున్నారు. సంజుకు మరిన్నీ అవకాశాలు ఇవ్వాలని తెలిపిన సంజయ్ మంజ్రేకర్. అతడు ఫాంలోకి వస్తే టీమిండియాకు తిరుగులేదని వెల్లడించారు.
ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మూడో టీ20లో ఓడిన సూర్యసేన.. తిరిగి గెలుపు బాట పట్టి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తొలి విజయం రుచి చూసిన ఇంగ్లండ్ నాలుగో టీ20లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. పుణెలో శుక్రవారం కీలక నాలుగో టీ20 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. రాత్రి 7 నుంచి మ్యాచ్ ఆరంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 2024లో సంచలన ఇన్నింగ్స్లు…
స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. కోల్కతాలో జరిగిన తొలి టీ20లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీశాడు. రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న చక్రవర్తి ఖాతాలో ఓ చెత్త…
మంగళవారం రాత్రి ఇంగ్లండ్తో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోవడం తనను చాలా బాధించిందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. మ్యాచ్ను తాము అనుకున్నవిధంగా ముగించలేకపోయామన్నాడు. ఫలితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి తర్వాత మ్యాచ్ కోసం సిద్ధమవుతా అని చెప్పాడు. ఈ మ్యాచులో బౌలింగ్ వేసి ఉండొచ్చు కానీ.. మున్ముందు ఇంకా మెరుగ్గా వేయాల్సిన అవసరం ఉందని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. మూడో టీ20లో చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు. చక్రవర్తి ఐదు…
ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్పై ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించాడు. రషీద్ కారణంగానే భారత్తో జరిగిన మూడో టీ20లో గెలిచామని చెప్పాడు. రషీద్ తమ జట్టులో ఉండటం అదృష్టం అని, వైవిధ్యంగా బంతులేయడం అతడి స్పెషాలిటీ అని పేర్కొన్నాడు. రషీద్, మార్క్ వుడ్ కలిసి ఇన్నింగ్స్ చివరలో విలువైన పరుగులు చేయడం కూడా కలిసొచ్చిందని బట్లర్ చెప్పుకొచ్చాడు. మంగళవారం రాత్రి భారత్తో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది.…