ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరుగుతోంది. నేడు (జూలై 6) ఈ మ్యాచ్లో చివరి రోజు. ఈరోజు, ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఆడుతోంది. ఓల్లీ పోప్ 24 పరుగులు, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో నాటౌట్గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్లో, భారత జట్టు ఇంగ్లాండ్కు 608 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.