Cyclone Mocha : ఇప్పటికే అకాల వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు. మళ్లీ పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. మే 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Cyclonic Circulation: భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మే 6 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ మంగళవారం తెలిపింది. యూఎస్ వెదర్ ఫోర్కాస్ట్ మోడల్ గ్లోబర్ ఫోర్కాస్ట్ సిస్టమ్(GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రెంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ECMWF) బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని తర్వాత ఐఎండీ కూడా…
Rains and Thunderstorms: అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.. అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.. ఇక, ఈ రోజు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రకటించారు.. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు..…
రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
దేశంలో కురుస్తున్న వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతోంది. ఇదిలా ఉండగా, మే నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం కనిపిస్తుంది.
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో రానున్న మూడు గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించారు. నగరంలో బలమైన గాలులతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గురువారం ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడంతో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
వేసవిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు, నాలుగు రోజులలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.