Rains In India: దేశంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains In India: రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.వర్షం కారణంగా వివిధ రాష్ట్రాల్లో సాధారణం కంటే అనేక స్థాయిల ఉష్ణోగ్రత తగ్గిందని, రాబోయే నాలుగు రోజులలో ఎక్కడా హీట్వేవ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. మే 5 నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ముందు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Read Also: Supreme Court: ఇద్దరికీ ఇష్టం లేకుంటే విడిపోవచ్చు.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
బుధవారం వరకు అనేక రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆ తర్వాత వర్షాలు తగ్గనున్నాయని వాతావరణ శాఖ సూచించింది.”దేశంలోని చాలా ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం మే 3 వరకు కొనసాగుతుంది. మే 4 నుంచి గణనీయంగా తగ్గుతుంది” అని ఐఎండీ పేర్కొంది. ఈ వర్షాలకు వాయువ్య భారతదేశం ఎక్కువగా ప్రభావితమవుతుందని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ అన్నారు. గత నెలలో వాతావరణ కార్యాలయం తన వార్షిక సూచనలో వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమూనాను అంచనా వేసింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 67 శాతం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ ప్రకారం, 1901లో రికార్డ్ కీపింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో ఈ ఏడాది తన అత్యధిక వేడి గల ఫిబ్రవరిని నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ముందు వర్షం, ఉరుములు, వడగళ్ల వానలు, మెరుపులతో పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ మార్పు ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతోంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?