Rains In India: దేశంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains In India: రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.వర్షం కారణంగా వివిధ రాష్ట్రాల్లో సాధారణం కంటే అనేక స్థాయిల ఉష్ణోగ్రత తగ్గిందని, రాబోయే నాలుగు రోజులలో ఎక్కడా హీట్వేవ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. మే 5 నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ముందు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Read Also: Supreme Court: ఇద్దరికీ ఇష్టం లేకుంటే విడిపోవచ్చు.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
Also Read
- Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
బుధవారం వరకు అనేక రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆ తర్వాత వర్షాలు తగ్గనున్నాయని వాతావరణ శాఖ సూచించింది.”దేశంలోని చాలా ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం మే 3 వరకు కొనసాగుతుంది. మే 4 నుంచి గణనీయంగా తగ్గుతుంది” అని ఐఎండీ పేర్కొంది. ఈ వర్షాలకు వాయువ్య భారతదేశం ఎక్కువగా ప్రభావితమవుతుందని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ అన్నారు. గత నెలలో వాతావరణ కార్యాలయం తన వార్షిక సూచనలో వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమూనాను అంచనా వేసింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 67 శాతం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ ప్రకారం, 1901లో రికార్డ్ కీపింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో ఈ ఏడాది తన అత్యధిక వేడి గల ఫిబ్రవరిని నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ముందు వర్షం, ఉరుములు, వడగళ్ల వానలు, మెరుపులతో పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ మార్పు ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతోంది.
తాజావార్తలు
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..