స్వచ్ఛతలో హైదరాబాద్ నగరం ముందుంది. హైదరాబాద్ లో ఉన్న హాస్పిటలిటీ ఎక్కడా లేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా ఉంది. స్వచ్ఛతలో ఎన్నో అవార్డ్ లు హైదరాబాద్ కి వచ్చాయి అని చెప్పారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. నగరంలోని పార్క్స్, రోడ్స్, బస్ షల్టర్స్ అన్ని కూడా సుందరంగా మారాయి. నగర వాసులు స్వచ్ఛ్ ఆటోలను ఉపయోగించుకోవాలి అని సూచించారు. చెత్తని…
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులు కీలకంగా మారాయి. మంచి చికిత్స పొందిన వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. భారత్లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మాత్రం ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి మొదటి…
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, నోటీసు వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. 13వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు… అయితే, ప్రస్తుతం హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో…
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో రాకింగ్ రాకేష్ ఒకడు. ఇతర కమెడియన్ల స్కిట్లకు భిన్నంగా రాకింగ్ రాకేష్ స్కిట్లు ఉంటాయి. అందుకే ప్రేక్షకులను అతడి స్కిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా కెరీర్ సాగిస్తున్న రాకింగ్ రాకేష్ తాజాగా బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. Read Also: బిగ్బాస్-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా? వివరాల్లోకి వెళ్తే… ఆదివారం నాడు శంషాబాద్లో స్వచ్ఛ సర్వేక్షణ్-2022…
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృతోత్సవ్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ ఫెయిర్లో 75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎన్టీయూహెచ్, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు నిపుణ సంస్థ ఫౌండర్ సుభద్రారాణి తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఈ జాబ్ ఫెయిర్లో 150కి పైగా…
చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను తగ్గించేందుకు మోదా టెక్నాలజీ వారు సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. చేనేత పరిశ్రమ అత్యంత శ్రమతో ముడిపడి ఉంది. చేనేత కార్మికులు జాక్వర్డ్ అటాచ్మెంట్ను ఆపరేట్ చేయడానికిశారీరకంగా శ్రమించవలసి ఉంటుంది. ఇది మగ్గాలు క్లిష్టమైన నమూనాలతో బట్టలను ఉత్పత్తి చేయడానికి శ్రమపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ జాక్వర్డ్ హ్యాండ్లూమ్లతో పనిచేసేటప్పుడు నేత కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటారు, జాక్వర్డ్ బాక్స్ హెవీవెయిట్ కారణంగా, మొత్తం మగ్గం యంత్రాన్ని నేత కార్మికులు కదపాల్సి ఉంటుంది. నేత…
చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు… 341, 323, 506 ఐసీపీ సెక్షన్ల కింద ముంతాజ్ ఖాన్పై కేసు బుక్ చేశారు హుస్సేనీ ఆలం పోలీసులు.. నిన్న అర్ధరాత్రి యువకుడి నమేస్తే కొట్టలేదాన్ని కారణంగా ముంతాజ్ ఖాన్ దాడి చేయడం.. ఆ యువకుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాతబస్తీ చార్మినార్ బస్టాండ్వద్ద…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఆదివారం ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ .. ”మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలను చేపట్టినట్టు వెల్లడించారు. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్లను చేయిస్తున్నామన్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పి.నిరూప్ను సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు నియమించింది. తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులైన తొలి న్యాయవాది నిరూప్. నిరూప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్, మంత్రి దివంగత పి. రామచంద్రారెడ్డి కుమారుడు. ఆయన మెదక్ జిల్లాకు చెందినవారు. 1985లో బార్ కౌన్సిల్లో చేరిన తర్వాత సంగారెడ్డిలోని మున్సిఫ్ కోర్టులో ప్రాక్టీస్ చేసి సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2017-2018కి ఢిల్లీలోని మేఘాలయ, షిల్లాంగ్ రాష్ట్రానికి…
తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లో మీడియాతో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఈడీ నోటీసుల భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు పెట్టారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, బీజేపీలోకి ఎవ్వరు వచ్చిన చేర్చుకుంటామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ర్టంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే…