దేశవాళీ టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ’ 2024కి సమయం ఆసన్నమైంది. నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 మధ్య ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును హెచ్సీఏ సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. భారత్, దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీలతో చెలరేగిన తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే హైదరాబాద్ జట్టుకు తిలక్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. 15…
"దీపం ఐక్యతకు చిహ్నం.. ఆ ఐక్యతే మనకు బలం.. మనలో ఆ ఐక్యత కొనసాగాలని ఆశిస్తూ.. అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది.. ఇటువంటి దీపోత్సవాల ద్వారా ప్రతి ఇల్లు ఒక ఇల్లు దేవాలయం కావాలి.. జ్ఞానసంపదకు క్షేత్రం కావాలి" అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోటి దీపోత్సవానికి హాజరై ప్రసంగించారు.
భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 'కోటి దీపోత్సవం' కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కార్తిక సోమవారం శుభవేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఇవాళ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గత సెప్టెంబర్లో ఇంటర్కాంటినెంటల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్.. మరో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి మైదానంలో భారత్, మలేసియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఇప్పటికే పూర్తిచేసింది. తొలిసారి హైదరాబాద్ వేదికగా ఫిఫా మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రాత్రి 7:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష…
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'కోటి దీపోత్సవం' తొమ్మిదో రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
హైదరాబాద్ మరొక మెగా టోర్నమెంట్ కు వేదిక కానుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్కు ఆతిధ్యమివ్వబోతుంది. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘనంగా ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు (సోమవారం) ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాతగా.. గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "కేరాఫ్ రవీంద్రభారతి". జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన, మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో చేస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతిలో జరిగాయి.
TSPSC Group-3: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఈ రోజు జరనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీ సుబ్రహ్మణ్యమఠం మాఠాధిపి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు.. ప్రవచనామృతం.. వేదికపై కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన.. భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన.. కోటి దీపోత్సవ దేదికపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. ఆ తర్వాత వరసిద్ధి…