హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల పెద్దమొత్తంలో పలువురి మొబైళ్లు అపహరణకు గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బాధితులు తమ మొబైల్ ఫోన్లు మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదులను హాక్ ఐ యాప్ను ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీని కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీతో మొబైల్ కేటుగాళ్లకు పోలీసులు చెక్ చెప్తున్నారు.
Read Also: గుడ్న్యూస్.. త్వరలో భారత్ నుంచి మరో రెండు వ్యాక్సిన్లు..
హాక్ ఐ టెక్నాలజీ ద్వారా కనిపెట్టిన 56 మొబైల్ ఫోన్లను సోమవారం నాడు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బాధితులకు అప్పగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. హాక్ ఐ యాప్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 565 మొబైల్ ఫోన్ల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్న మొబైల్ ఫోన్ల విలువ రూ.8లక్షలు ఉంటుందని సమాచారం.