Hyderabad: హైదరాబాద్ నగరాన్ని కల్తీ ఆహార పదార్థాల మాఫియా కుదిపేస్తోంది. వరుస దాడుల్లో కల్తీగాళ్ల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ కల్తీ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నాసిరకం నూనెలు, కాలం చెల్లిన పిండి పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కేటుగాళ్లు నగర ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడుల్లో మైలార్దేవ్పల్లి పరిధిలో కల్తీ మిక్చర్, బిస్కట్లు, చిక్కీలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ ఘటనలో ముగ్గురు…