Hyderabad: హైదరాబాద్లో కలుషిత ‘అల్లం-వెల్లుల్లి’ పేస్ట్ గుట్టురట్టు.. రూ. 22 లక్షల సామగ్రి సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలో కలుషిత ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక ప్రాంతంలో నాసిరకం అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్), హెచ్-ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించింది. పక్కా సమాచారంతో పోలీసులు కట్టెదాన్ ఐడీఏలోని ‘SKR ఫుడ్ ప్రొడక్ట్స్’ (ప్లాట్ నెం.25, SEIE) పై దాడి చేశారు. ఈ సందర్భంగా హసన్ అలీ రూపానీ (55) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబిడ్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. తనిఖీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో, పరిశుభ్రతకు విరుద్ధంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.
READ MORE: UP: దోమల కోసం అగరబత్తులు వెలిగింపు.. 4 సిలిండర్లు పేలి.. సోదరులకు తీవ్రగాయాలు
Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్ వంటి రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన పేస్ట్ను బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడంతో దుమ్ము, ఈగలు వాలినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేస్ట్ను హోల్సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిందితుడు చెలగాటం ఆడుతున్నాడని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే లాభాపేక్షతో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దాడిలో సుమారు రూ.22 లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4,032 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్, 6,000 కిలోల నాసిరకం వెల్లుల్లి, 210 కిలోల నాసిరకం అల్లం, వెల్లుల్లి పొట్టు సంచులు, 250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్, 5 గ్రైండింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని, స్వాధీనం చేసిన సామగ్రిని తదుపరి విచారణ కోసం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
తాజావార్తలు
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!