Hyderabad: హైదరాబాద్లో కలుషిత ‘అల్లం-వెల్లుల్లి’ పేస్ట్ గుట్టురట్టు.. రూ. 22 లక్షల సామగ్రి సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలో కలుషిత ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక ప్రాంతంలో నాసిరకం అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్), హెచ్-ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించింది. పక్కా సమాచారంతో పోలీసులు కట్టెదాన్ ఐడీఏలోని ‘SKR ఫుడ్ ప్రొడక్ట్స్’ (ప్లాట్ నెం.25, SEIE) పై దాడి చేశారు. ఈ సందర్భంగా హసన్ అలీ రూపానీ (55) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబిడ్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. తనిఖీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో, పరిశుభ్రతకు విరుద్ధంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.
READ MORE: UP: దోమల కోసం అగరబత్తులు వెలిగింపు.. 4 సిలిండర్లు పేలి.. సోదరులకు తీవ్రగాయాలు
Also Read
- ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
- Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్ వంటి రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన పేస్ట్ను బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడంతో దుమ్ము, ఈగలు వాలినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేస్ట్ను హోల్సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిందితుడు చెలగాటం ఆడుతున్నాడని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే లాభాపేక్షతో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దాడిలో సుమారు రూ.22 లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4,032 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్, 6,000 కిలోల నాసిరకం వెల్లుల్లి, 210 కిలోల నాసిరకం అల్లం, వెల్లుల్లి పొట్టు సంచులు, 250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్, 5 గ్రైండింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని, స్వాధీనం చేసిన సామగ్రిని తదుపరి విచారణ కోసం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
తాజావార్తలు
-
ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
-
Prabhas : తన మూవీస్కు తప్ప పక్కసినిమాలన్నిటికీ ప్రమోషన్ చేస్తున్న డార్లింగ్
-
Financial Planning: ప్రతి తండ్రి 50 ఏళ్లలోపు.. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 7 ఆర్థిక ప్రణాళికలు
-
Family Suicide Case: “నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి”.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
-
Virat Kohli: ప్రతి మ్యాచ్కు ముందు విరాట్ తప్పకుండా వినే ఒక్క పాట ఇదే.. ఆ పాట వెనుక అంత స్టోరీ ఉందా?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!