Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ మాలిక్కు అవకాశం లభించింది. అండర్-19 ఏ జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్గా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ టోర్నమెంట్లో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు.
భారత మాజీ ఆల్రౌండర్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) కన్నుమూశారు. కెరీర్ అనంతరం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డ ఆయన అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అబిద్ అలీ బంధువు రెజా ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అబిద్ అలీ మృతి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్, భారత మాజీ క్రికెటర్ అండ్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్లు అబిద్ అలీ…
వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఇన్స్టా వేదికగా వెల్లడించారు.