ప్రభుత్వ పాఠశాలలో కుమారుడి పెళ్లి జరిపించిన టీచర్కి హిమాచల్ప్రదేశ్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా మందలించింది. ప్రభుత్వ పాఠశాలలో పెళ్లి ఎలా జరిపిస్తారంటూ న్యాయస్థానం నిలదీసింది. విచారణ సందర్భంగా టీచర్ క్షమాపణ చెప్పారు. నాలుగు వారాల్లోగా పాఠశాల క్యాంపస్లో రెండు వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.