Himachal Pradesh Political Crisis: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం.. మైనార్టీలో కాంగ్రెస్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Political Crisis: రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓట్లు రావడంతో హస్తం పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ పార్టీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు స్టార్ట్ చేసింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్యెలేలతో చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతో పాటు డీకే శివకుమార్ ను పంపించింది. అయితే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు ఇవాళ డీకే శివుకుమార్, భూపేందర్ సింగ్ సిమ్లాకు చేరుకోనున్నారు.
Read Also: Jacintha Kalyan: అప్పుడు రిసెప్షనిస్ట్.. ఇప్పుడు పిచ్ క్యూరేటర్! ప్రశంసించిన జై షా
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అయితే, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లిపోయారు. వారందరూ బీజేపీతో టచ్ లో ఉన్నట్లు టాక్. హర్యానాలోని పంచకులాలోని గెస్ట్హౌస్ బయట ఓ కాన్వాయ్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ శర్మ, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక, అసెంబ్లీ సమావేశాలకు ముందు నేటి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ ఎమ్మెల్యేలు కలవనున్నట్లు అనేక కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిందని జై రాం ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: Paytm : పేటీఎం లాంటి అక్రమాలు మళ్లీ జరుగకుండా ఆర్బీఐ పక్కా ప్లాన్
ఇక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక్క రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ విజయం ఈజీ అని అందరు అనుకున్నారు. కానీ, భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు.. దీంతో కాంగ్రెస్, బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి.. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీయగా.. అందులో బీజేపీకి చెందిన హర్ష్ మహాజన్ పేరు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
-
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
-
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!