Himachal Pradesh Political Crisis: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం.. మైనార్టీలో కాంగ్రెస్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Political Crisis: రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓట్లు రావడంతో హస్తం పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ పార్టీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు స్టార్ట్ చేసింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్యెలేలతో చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతో పాటు డీకే శివకుమార్ ను పంపించింది. అయితే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు ఇవాళ డీకే శివుకుమార్, భూపేందర్ సింగ్ సిమ్లాకు చేరుకోనున్నారు.
Read Also: Jacintha Kalyan: అప్పుడు రిసెప్షనిస్ట్.. ఇప్పుడు పిచ్ క్యూరేటర్! ప్రశంసించిన జై షా
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
అయితే, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లిపోయారు. వారందరూ బీజేపీతో టచ్ లో ఉన్నట్లు టాక్. హర్యానాలోని పంచకులాలోని గెస్ట్హౌస్ బయట ఓ కాన్వాయ్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ శర్మ, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక, అసెంబ్లీ సమావేశాలకు ముందు నేటి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ ఎమ్మెల్యేలు కలవనున్నట్లు అనేక కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిందని జై రాం ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: Paytm : పేటీఎం లాంటి అక్రమాలు మళ్లీ జరుగకుండా ఆర్బీఐ పక్కా ప్లాన్
ఇక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక్క రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ విజయం ఈజీ అని అందరు అనుకున్నారు. కానీ, భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు.. దీంతో కాంగ్రెస్, బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి.. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీయగా.. అందులో బీజేపీకి చెందిన హర్ష్ మహాజన్ పేరు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!