బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల స్కోరును సాధించి.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ వర్మ త్వరగానే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది.…