Home
Health News
Health News News
-
China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్కు డేంజరేనా?
China: చైనాలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ వ్యాప్తి ఇన్ఫ్లుయెంజాను దాటేసి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధిగా నమోదైంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, గత ఏడాది పరిస్థితులతో పోలిస్తే ఈసారి వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. జూన్లో 79 వేల కొత్త కేసులు చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం… -
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Pregnancy: మహిళకు గర్భధారణ సమయంలో సౌందర్య సాధనాలు ప్రమాదం తెస్తున్నాయని లేటెస్ట్ సర్వే వెల్లడించింది. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కొన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ నిర్వహించిన తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రసాయనాలు గర్భిణుల శరీరంలో పెరుగుతున్నాయని, అవి తల్లి గర్భంలో శిశువు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరించింది. 641 మంది ఆరోగ్యవంతమైన… -
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
Black Jamun: పల్లెటూర్లలో సులభంగా దొరికే నేరేడు పండు (బ్లాక్ జామున్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓ సీజనల్ ఫ్రూట్. బయటకు సాధారణంగా కనిపించినప్పటికీ.. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ముఖ్యంగా మధుమేహం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం వంటి అనేక అంశాల్లో ఇది శరీరానికి సహజ మద్దతు అందిస్తుంది. మధుమేహ నియంత్రణ: నేరేడు పండులో “జాంబోలిన్” (Jamboline) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు… -
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
Diabetes: జీవనశైలి వ్యాధిగా మధుమేహం(షుగర్) వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. మరోవైపు, భారత్ ‘‘డయాబెటిక్ క్యాపిటల్’’గా మారుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్కు అలవాటు పడటం ఈ పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. షుగర్ వ్యాధికి శాశ్వత నివారణ లేనప్పటికీ, మన జీవనశైలి మార్పుతో షుగర్ లేకుండా జీవించవచ్చు. శారీరక శ్రమ, ప్రొటీన్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ను తక్కువగా తింటే షుగర్ లేకుండానే జీవితం గడపొచ్చు. అయితే,… -
Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
Viral News: ఇంట్లో పిల్లలు ఆడుకుంటుంటే బొమ్మలు, పెన్సిళ్లు, రబ్బర్లు చుట్టూ కనిపించడం సహజం. కానీ ఆ చిన్న వస్తువులే ఒక్క క్షణంలో ప్రాణాపాయంగా మారవచ్చని ఘాజియాబాద్లో జరిగిన ఒక ఘటన మరోసారి గుర్తు చేసింది. నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ ఉండగా చిన్న రబ్బరు ముక్కను అనుకోకుండా లోపలికి పీల్చుకోవడంతో అతని ఊపిరితిత్తి పూర్తిగా కుంగిపోయింది. అయితే వైద్యుల అప్రమత్తతతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘాజియాబాద్కు చెందిన ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో చిన్న… -
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
Sugar Free Diet: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది చక్కెర వినియోగాన్ని తగ్గిస్తున్నారు. మరికొందరు పూర్తిగా చక్కెరకు దూరంగా ఉంటూ ‘షుగర్-ఫ్రీ’ జీవనశైలిని అనుసరిస్తున్నారు. మార్కెట్లో కూడా షుగర్-ఫ్రీ, లో-ఫ్యాట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే చక్కెరను పూర్తిగా మానేయడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నకు తాజా పరిశోధన కొత్త కోణాన్ని చూపిస్తోంది. అమెరికాలోని చికాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశం ‘ENDO 2026’లో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆహారం… -
Alcohol With Drinks: మందులో ఆ డ్రింక్ మిక్స్ చేసుకొని తాగుతున్నారా? డాక్టర్లు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్!
Alcohol With Drinks : జోష్ పెంచుతుందనుకున్న డ్రింక్… గుండెకు ముప్పు తెస్తే? పార్టీలు, వేడుకలు, స్నేహితుల సమావేశాల్లో మద్యం గ్లాస్లో ఎనర్జీ డ్రింక్ కలపడం ఇప్పుడు చాలా మందికి సాధారణ అలవాటుగా మారింది. ముఖ్యంగా యువతలో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. రాత్రంతా ఉత్సాహంగా ఉండటానికి, అలసట లేకుండా ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన మార్గమని చాలామంది భావిస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ దీన వెనుక ఉన్న ప్రమాదాలను హెచ్చరిస్తున్నారు. కాసేపు ఉత్సాహం… -
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
Fish Medicine: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయగా.. వేలాది మంది ప్రజలు ప్రసాదం కోసం తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది.… -
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
Protein Powder : నేటి ఆధునిక కాలంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో మనం తీసుకునే ప్రతి ఆహారంలోనూ ప్రోటీన్ ఎంతుందో గమనించడం ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా ఫిట్నెస్ ప్రేమికులు, జిమ్కు వెళ్లే యువత , బరువు తగ్గాలనుకునే వారు తమ రోజును ప్రోటీన్ పౌడర్ కలిపిన స్మూతీలు లేదా షేక్స్తో ప్రారంభించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అసలు ఎంతవరకు సురక్షితం, వీటి తయారీ ఎలా జరుగుతుంది , వీటి వల్ల కలిగే… -
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
Summer Tips: వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఎండలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎండల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగుతుంటారు. చల్లని నీరు తాగగానే చాలా రిలీఫ్ వచ్చినట్లు అనిపించినా, ఇది చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరం ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. ఎండల తీవ్ర ఎక్కువగా ఉంటే చెమటలు…
తాజావార్తలు
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!