హత్రాస్ తొక్కిసలాట ఘటనను హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం హత్రాస్లో సత్సంగం (మత సమ్మేళనం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు.
ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ జిల్లాలోని రతీఖాన్పూర్లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 100 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు అధికంగా పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.