Hathras: హత్రాస్ దుర్ఘటన.. యూపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- యూపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి మండిపాటు
- పరిపాలన.. నిర్వాహకుల వైఫల్యం కారణంగా హత్రాస్లో తొక్కిసలాట
- హత్రాస్లో మంగళవారం జరిగిన సత్సంగ్లో 120 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Satsang Incident: హత్రాస్ తొక్కిసలాట ఘటనను హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం హత్రాస్లో సత్సంగం (మత సమ్మేళనం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. హత్రాస్ దుర్ఘటన ప్రమాదమా లేక కుట్ర జరిగిందా అనేది విచారణలో తేలుతుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చెప్పిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం సరైనది కాదని ఆర్కే చౌదరి అన్నారు. “యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనిని హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలనుకుంటోంది. ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు. హత్రాస్ ఒక ప్రమాదం. ఇది పరిపాలన, నిర్వాహకుల వైఫల్యం.” అని సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆర్కే చౌదరి అన్నారు.
Read Also: హత్రాస్లో ఆగని మృత్యుఘోష.. అసలు ఏం జరిగింది..?
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఇదిలా ఉండగా.. తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. “ఈ సంఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పరిపాలన పూర్తి బాధ్యత వహిస్తుంది. కొంత మంది గాయపడిన వ్యక్తులు సరైన చికిత్స లేకపోవడం వల్ల మరణించారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి” అని ఆయన అన్నారు.
ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది. అయితే ఎఫ్ఐఆర్లో నిందితుల జాబితాలో భోలే బాబా పేరు లేకపోవడం గమనార్హం. ఎఫ్ఐఆర్లో ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ మధుకర్, ఇతర నిర్వాహకుల పేర్లు ఉన్నాయి. 80,000 మందికి మాత్రమే అనుమతి ఉందని, 2.5 లక్షల మంది ప్రజలు సమావేశమయ్యారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి కోరుతూ ‘సత్సంగం’కు వచ్చిన భక్తుల అసలు సంఖ్యను నిర్వాహకులు దాచారని, ట్రాఫిక్ నిర్వహణకు సహకరించలేదని, తొక్కిసలాట జరిగిన తర్వాత ఆధారాలు దాచిపెట్టారని ఎఫ్ఐఆర్లో తెలిపారు. సభా వేదిక నుంచి బయటకు వస్తుండగా భోలే బాబా పాదాలను తాకేందుకు వేలాది మంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!