Hathras: హత్రాస్ దుర్ఘటన.. యూపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- యూపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి మండిపాటు
- పరిపాలన.. నిర్వాహకుల వైఫల్యం కారణంగా హత్రాస్లో తొక్కిసలాట
- హత్రాస్లో మంగళవారం జరిగిన సత్సంగ్లో 120 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Satsang Incident: హత్రాస్ తొక్కిసలాట ఘటనను హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి పేర్కొన్నారు. మంగళవారం హత్రాస్లో సత్సంగం (మత సమ్మేళనం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. హత్రాస్ దుర్ఘటన ప్రమాదమా లేక కుట్ర జరిగిందా అనేది విచారణలో తేలుతుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చెప్పిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం సరైనది కాదని ఆర్కే చౌదరి అన్నారు. “యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనిని హిందూ-ముస్లిం సమస్యగా మార్చాలనుకుంటోంది. ముఖ్యమంత్రి ఉద్దేశం తప్పు. హత్రాస్ ఒక ప్రమాదం. ఇది పరిపాలన, నిర్వాహకుల వైఫల్యం.” అని సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆర్కే చౌదరి అన్నారు.
Read Also: హత్రాస్లో ఆగని మృత్యుఘోష.. అసలు ఏం జరిగింది..?
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
ఇదిలా ఉండగా.. తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. “ఈ సంఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పరిపాలన పూర్తి బాధ్యత వహిస్తుంది. కొంత మంది గాయపడిన వ్యక్తులు సరైన చికిత్స లేకపోవడం వల్ల మరణించారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి” అని ఆయన అన్నారు.
ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది. అయితే ఎఫ్ఐఆర్లో నిందితుల జాబితాలో భోలే బాబా పేరు లేకపోవడం గమనార్హం. ఎఫ్ఐఆర్లో ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ మధుకర్, ఇతర నిర్వాహకుల పేర్లు ఉన్నాయి. 80,000 మందికి మాత్రమే అనుమతి ఉందని, 2.5 లక్షల మంది ప్రజలు సమావేశమయ్యారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి కోరుతూ ‘సత్సంగం’కు వచ్చిన భక్తుల అసలు సంఖ్యను నిర్వాహకులు దాచారని, ట్రాఫిక్ నిర్వహణకు సహకరించలేదని, తొక్కిసలాట జరిగిన తర్వాత ఆధారాలు దాచిపెట్టారని ఎఫ్ఐఆర్లో తెలిపారు. సభా వేదిక నుంచి బయటకు వస్తుండగా భోలే బాబా పాదాలను తాకేందుకు వేలాది మంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
తాజావార్తలు
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..