Gyanvapi Mosque: వారణాసిలో ‘‘జ్ఞానవాపి’’ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై ఇటు హిందూ సంఘాలు, అటు మసీద్ కమిటీ మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ జ్ఞానవాపి మసీదు కాదని, అది శివాలయమే అని అన్నారు. శనివారం వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలువడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, అది 'శివుని దేవాలయం' అని చెప్పారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మధుర, అయోధ్య గురించి మాట్లాడారు. రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనను సంతరించుకున్నాయి. అయోధ్య నగరాన్ని గత ప్రభుత్వాలు నిషేధాలు, కర్ఫ్యూల పరిధిలో ఉంచాయని, శతాబ్ధాలుగా అయోధ్యను నీచ ఉద్దేశాలతో తిట్టారని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బహుశా మరెక్కడ చూడలేదని, అయోధ్యకు అన్యాయం జరిగిందని యోగి అన్నారు.