నీటి పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు డెయిరీ నిర్వాహకుడికి చెందిన గేదెను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసి) శుక్రవారం స్వాధీనం చేసుకుంది. మొండిగా వ్యవహరించే ఎగవేతదారుల నుంచి ఆస్తి, నీటి పన్ను బకాయిలను వసూలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.