Odisha: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాల హాస్టల్లో 10 వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బోర్డు పరీక్షలు రాసిన తర్వాత, హాస్టల్కి తిరిగి వచ్చిన బాలిక సోమవారం ఆడ శిశువుకు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు.