ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వేషాల కారణంగా గోదావరిలో వరద ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అప్పర్ డ్యామ్ నిర్మాణం కావడంతో బ్యాక్ వాటర్ లో నీటి మట్టం పెరిగి ముంపు ప్రాంతాల ప్రజలు భయం పట్టుకుంది. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకొని పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తునం అంటున్నారు చీఫ్ ఇంజనీర్ సుధాకర్.
పోలవరం ప్రాజెక్టులో నేడు ఓ మైలురాయిగా మిగిలిపోనుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి నేడు దిగువకు గోదావరి నీటి విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి అయ్యింది. స్పిల్ వే మీదుగా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. కాఫర్ డ్యాం బ్యాక్ వాటర్ తో ముంపు గ్రామాలకు వరద భయం ఉంది. దాంతో ముంపు గ్రామాల నిర్వాసితులు గ్రామాలు ఖాళీచేస్తున్నారు. ఈరోజు అప్రోచ్…
రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద ఈ నెల 1న గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెళ్లెల్లు, తమ్ముడు. తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై గోదావరిలో దూకి అత్మహత్య చేసుకున్నారు కుమార్తెలు, కుమారుడు. మృతులు ప.గో.జిల్లా కొవ్వూరు బాపూజీనగర్ కు చెందిన అక్క మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా గుర్తించారు.…