తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు సార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ…
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై ఆయన స్పందించారు. 317జీవో తెచ్చి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కనీసం ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించకుండా జీవో ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఖాళీలను నింపి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించారు. Read Also: ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రిలో దారుణం ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని…
తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఖాళీగా వున్ర పోస్టు లను భర్తీ చేయకుండా బదిలీల చేయడమేమిటని అన్నారు. మూడున్నర లక్షల ఉద్యోగ వ్యవస్థ ను అగమ్యగోచరంగా తయారు చేశారు. స్థానికత ను ప్రధానంగా తీసుకోకుండా బదిలీలు చేశారన్నారు. స్థానికత కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. ఉద్యోగం చేస్తున్న భార్య కేసులను కూడా పట్టించుకోక పోవడం దారుణం. అనారోగ్యం ఉన్న వారిని పట్టించుకోకుండా బదిలీలు చేశారు.…
రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నిరసనకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా ఉన్న 317 జీఓను ఉపసంహరించుకునేలా రేపు రాత్రంతా కరీంనగర్లో జాగరణకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో రేపు (జనవరి 2) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు (జనవరి 3) ఉదయం 5 గంటల…
ఎలాంటి కష్టం వచ్చినా.. ప్రశ్నిస్తామన్న ఆ ఎమ్మెల్సీలు.. కీలక సమయంలో ఏమయ్యారు? టీచర్లు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? కొత్త జోనల్ విధానంపై తప్పించుకుని తిరుగుతున్నారా? ఎవరా ఎమ్మెల్సీలు? జీవో 317కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన..!కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపుల ప్రక్రియను మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్. చకచకా పనులు చేసుకుంటూ వెళ్తోంది. అలకేషన్కు సంబంధించిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉంది. వీరిలో టీచర్లు తెగించి రోడ్డెక్కారు.…
తెలంగాణలో రచ్చరేపుతోంది జీవో నెంబర్ 317. ఈ జీవో పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 371 డి ని పార్లమెంట్ లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని కోర్టుకు తెలిపారు పిటిషనర్. 317 జీవో పై స్టే ఇవ్వాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య. స్టే ఇవ్వడానికి నిరాకరించారు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు తుడుందెబ్బ పిలుపు నిచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన 317 జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది తుడుం దెబ్బ. ఉదయం నుంచే ఆదిలాబాద్ బస్టాండ్ ముందు ఆదివాసి హక్కుల పోరాట సమితి ధర్నా చేయడంతో బస్సులు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ నంబర్ 3 ప్రకారం నియమితులైన ఉద్యోగులనే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా తుడుం దెబ్బ నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను 317…