ఉలుకు పలుకు లేని టీచర్ ఎమ్మెల్సీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలాంటి కష్టం వచ్చినా.. ప్రశ్నిస్తామన్న ఆ ఎమ్మెల్సీలు.. కీలక సమయంలో ఏమయ్యారు? టీచర్లు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? కొత్త జోనల్ విధానంపై తప్పించుకుని తిరుగుతున్నారా? ఎవరా ఎమ్మెల్సీలు?
జీవో 317కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన..!
కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపుల ప్రక్రియను మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్. చకచకా పనులు చేసుకుంటూ వెళ్తోంది. అలకేషన్కు సంబంధించిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉంది. వీరిలో టీచర్లు తెగించి రోడ్డెక్కారు. అన్యాయం జరుగుతోందని ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోతే తమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నది వారి ఆవేదన. సీనియారిటీలో అన్యాయం జరుగుతోందని.. భార్యాభర్తల అంశాన్ని పరిశీలించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆప్షన్ ఒకచోట ఇస్తే.. తప్పుగా నమోదు చేసి మరోచోట పోస్టింగ్ ఇస్తున్నారని మండిపడుతున్నారు ఉపాధ్యాయులు.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఉపాధ్యాయులను పట్టించుకోని టీచర్ ఎమ్మెల్సీలు..?
ఈ కీలక సమయంలో తమకు అండగా ఉంటారని భావించిన టీచర్ ఎమ్మెల్సీలు అజాపజా లేకపోవడంతో ఉపాధ్యాయులు.. టీచర్ల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణలో టీచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అయిన వారిలో జనార్దన్రెడ్డి, రఘోత్తమరెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. వీరిలో నర్సిరెడ్డి యూటీఎఫ్కు చెందినవారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి.. కొత్త జోనల్ విధానంలో అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నిస్తున్నారట.
టీచర్లకు అందుబాటులో లేని ఎమ్మెల్సీలు…?
ప్రభుత్వానికి, అధికారపార్టీకి దగ్గర అని చెప్పుకొనే టీచర్ ఎమ్మెల్సీలు.. ఉపాధ్యాయ బదిలీల రగడపై కిక్కురు మనడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదో తెలియదు. స్పందిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారో ఏమో.. టీచర్లకు, టీచర్ల సంఘాలకు అందుబాటులో లేకుండా పోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పించుకుని తిరుగుతున్నట్టు చెబుతున్నారు. కనీసం ఉపాధ్యాయులకు భరోసా కల్పించేలా ఒక్క మాటా మాట్లాడ లేదట. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నిర్వహించిన చర్చల ప్రక్రియలో తమను భాగస్వామ్యం చేయలేదని ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు జీవోపై అభ్యంతరాలు ఉన్నా.. పట్టించుకునే పరిస్థితి లేదని సమాచారం. ప్రభుత్వానికి.. తమకు మధ్య వారధిగా ఉండాల్సిన సమయంలో ఎమ్మెల్సీలు టచ్మీ నాట్గా ఉండటం ప్రశ్నగా మారింది.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!