Minister KTR: హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Ward system: పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వార్డు పాలనా వ్యవస్థ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో నెలాఖరులోగా 150 వార్డు కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
Mayor Vijayalakshmi: బీజేపీ కార్పొరేటర్ల తీరుపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫైర్ అయ్యారు. అధికారులకు సిగ్గు లేదని మాట్లాడతారా? అంటూ బీజేపీ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జీహెచ్ఎంసీ సాధారణ సమావేశం ప్రారంభం కాగానే సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొన విషయం తెలిసిందే.
Mayor Vijayalaxmi: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఇంకా చాలా చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో సముద్రాన్ని తలపించాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానకు రోడ్లపైకి వర్షపునీరు చేరింది.
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సూచనల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
హైదరాబాద్ మల్కాజ్గిరిలో జీహెచ్ఎంసీ చెత్త ట్రక్కు ఢీకొని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల బాలుడు ఓ ప్రాంతంలో రోడ్డుపై ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బర్త్ సర్టిఫికెట్ల జారీ స్కాం లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆర్డీవో స్థాయి అధికారి అనుమతి లేకుండానే వేల సర్టిఫికెట్లు జారీచేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మీసేవా కేంద్రాల ద్వారా 22,954 సర్టిఫికెట్లు ఆర్డీఓ అనుమతి లేకుండానే జారీ అయ్యాయని గుర్తించారు. 2 వేలకు పైగా డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ కాగా.. మీ సేవ కేంద్రాల ద్వారా 31 వేల నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లుగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.