GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మధ్యంలో కటింగ్, తవ్వకాలు చేయడాన్ని నిషేధిస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రోడ్డు తవ్వడం, కటింగ్ పై నిషేధం విధించింది.
BJP Corporators: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ల సమావేశమయ్యారు. జల మండలి, జీహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు.
Off The Record: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అధికార బిఆర్ఎస్ లో లుకలుకలు పెరుగుతున్నాయని కేడర్ కోడై కూస్తోంది. BRS పార్టీ ఎమ్మెల్యేలకు…ఆ పార్టీ కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా వుంటోందన్న చర్చ సాగుతోంది. వివిధ రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలకు…కార్పొరేటర్ లకు మధ్య ఎడం చాంతాడంత పెరుగుతోందట. అప్పుడప్పుడు ఆ విబేధాలు బయట పడితే…మరి కొన్ని సందర్భాల్లో లోలోపల కత్తుల దూసుకుంటున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఫలితాలపై వీరి కోల్డ్ వార్…
Minister KTR: హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Ward system: పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వార్డు పాలనా వ్యవస్థ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో నెలాఖరులోగా 150 వార్డు కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
Mayor Vijayalakshmi: బీజేపీ కార్పొరేటర్ల తీరుపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫైర్ అయ్యారు. అధికారులకు సిగ్గు లేదని మాట్లాడతారా? అంటూ బీజేపీ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జీహెచ్ఎంసీ సాధారణ సమావేశం ప్రారంభం కాగానే సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొన విషయం తెలిసిందే.
Mayor Vijayalaxmi: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఇంకా చాలా చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో సముద్రాన్ని తలపించాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానకు రోడ్లపైకి వర్షపునీరు చేరింది.