BJP Corporators: వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి.. గవర్నర్కు వినతిప్రతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Corporators: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ల సమావేశమయ్యారు. జల మండలి, జీహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల జీహెచ్ఎంసీ సమావేశం వాయిదా పడడంపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు గవర్నర్కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు.
జీహెచ్ఎంసీ సమావేశంలో జరిగిన పరిణామాలను బీజేపీ కార్పొరేటర్లు గవర్నర్కు వివరించారు. సమస్యలు చర్చించకుండానే జీహెచ్ఎంసి సమావేశం బాయికాట్ చేసినందుకు గవర్నర్ కు పిర్యాదు చేశామని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. సంబంధిత అధికారులను పిలిచి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. గ్రేటర్ లో ఇబ్బందులపై కౌన్సిల్ లో మాట్లాడదాం అంటే సమావేశాలు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. అధికారులు ఎన్నికైన కార్పొరేటర్లను అవమానపరిచారని అన్నారు.
Also Read
తాజాగా జీహెచ్ఎంసీ సాధారణ సమావేశం ప్రారంభం కాగానే సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొన విషయం తెలిసిందే. అధికార బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో జలమండలి అధికారులు, జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. అయితే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించడం ఇదే తొలిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. బీజేపీ కార్పొరేటర్లు మినహా మిగిలిన కార్పొరేటర్ల పరిధిలో సమస్యలు లేవా? అని అడిగారు.
సమస్యలపై చర్చించకుంటే ఎలా పరిష్కరిస్తారని మండి పడ్డారు. జీహెచ్ఎంసీ సాధారణ సమావేశం నిర్వహించే ఉద్దేశం బీజేపీ కార్పొరేటర్లకు లేదన్నారు. సమస్యలకు సమాధానం చెప్పేందుకు తాను, అధికారులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సభ సజావుగా సాగేందుకు అధికారులతో, పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడబోమన్నారు. అయితే బీజేపీ కార్పొరేటర్లకు రెండు నిమిషాలు కూడా ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల కార్పొరేటర్లతో వాగ్వాదానికి దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ కార్పొరేటర్ల తీరు బాగోలేదని జోనల్ కమిషనర్లు కూడా చెబుతున్నారని అన్నారు. తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Gutha Sukender Reddy: కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే
తాజావార్తలు
-
Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్కు షాక్.. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!