ఉత్తర నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 94 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఉత్తర జిగావా రాష్ట్రంలో రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. అయితే సమీపంలో ఉన్న స్థానికులకు ఈ సమాచారం తెలిసింది.